బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ని పార్టీ అధిష్ఠానం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది...

సునీల్ తొలగింపు వెనుక..?
కాగా.. రాష్ట్ర బీజేపీ సహ ఇన్చార్జి, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ధర్ను పార్టీ పక్కన పెట్టేసింది. ఐదేళ్లుగా పార్టీపరంగా ఏపీకి అందించిన సేవలు చాలంటూ ఉద్వాసన పలికింది. శనివారం పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన జేపీ నడ్డా తన బృందంలో సునీల్కు చోటివ్వలేదు. మహరాష్ట్రకు చెందిన సునీల్ దేవ్ధర్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఆరేళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు అమిత్షా ఆయనను నియమించారు. 2018, జూలై 30న రాష్ట్ర సహ ఇన్చార్జిగా నియమించారు. అయితే ఏపీలో సునీల్ సేవలు ఆది నుంచి వివాదాస్పదమే అయ్యాయి. సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టడం తప్ప క్షేత్రస్థాయిలో దేవ్ధర్ పనితీరుపై పార్టీ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉందనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా మీడియా ముందు రాష్ట్ర సర్కారుపై విమర్శలు చేస్తూనే.. తెరవెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో చెలిమి చేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో బీజేపీ పెద్దలు జాతీయ కార్యవర్గం నుంచి తప్పించారనే చర్చసాగుతోంది. ఇదిలావుంటే, రాష్ట్రం నుంచి జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న వై.సత్యకుమార్ను అదే స్థానంలో కొనసాగించారు.
కామెంట్ను పోస్ట్ చేయండి