మీర్ ఉస్మాన్ అలీఖాన్ మ‌నుమ‌డు ష‌హ‌మ‌త్ ఝా క‌న్నుమూత‌ || Hyderabad

  హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ప్రిన్స్ ష‌హమత్ ఝా(70) కన్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ష‌హ‌మ‌త్ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు.

Hyderabad | మీర్ ఉస్మాన్ అలీఖాన్ మ‌నుమ‌డు ష‌హ‌మ‌త్ ఝా క‌న్నుమూత‌

Hyderabad | హైద‌రాబాద్ : హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ప్రిన్స్ ష‌హమత్ ఝా(70) కన్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ష‌హ‌మ‌త్ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు మోజం ఝా రెండవ భార్య అన్వరీ బేగం కుమారుడే ఈ షహమత్ ఝా. ష‌హ‌మ‌త్ ఝా ఇద్దరిని వివాహం చేసుకోగా.. సంతానం మాత్రం క‌ల‌గ‌లేదు. ఇద్ద‌రు భార్య‌లు ఝా నుంచి దూర‌మైన త‌ర్వాత ఒంటరిగానే జీవించారు.

రెడ్‌హిల్స్‌లోని తన ఇంటిని విక్రయించిన తర్వాత బంజారాహిల్స్‌లోని తన సోదరి ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నారు. అతను షాజీ అనే క‌లం పేరుతో ఉర్దూలో కవిత్వం రాశాడు. నిజాం తన పేరు మీదుగా మోజం జాహీ మార్కెట్ అని పేరు పెట్టాడు. కాగా సోమవారం ఉదయం…అతని తాత ఉస్మాన్ అలీ ఖాన్ సమాధి సమీపంలో హైదరాబాద్ కోఠిలోని మస్జిద్-ఎ-జూడిలో అంత్య‌క్రియ‌లు నిర్వహించనున్నారు నిజాం కుటుంబ సభ్యులు.

JOIN

Post a Comment

أحدث أقدم